కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు.
కరోనా సెకండ్ వేవ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో నరసరావుపేట లింగంగుంట్ల కోవిడ్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో ఆయన ఫోన్లో మాట్లాడారు.
ఈ సందర్భంగా నరసరావుపేట లో కోవిడ్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్ లో వైద్య సేవలు అందించేందుకు అదనంగా వైద్యులతో పాటు నర్సులు, సిబ్బందిని నియమించాలని కోరారు.
ఆక్సిజన్ సరఫరాను అన్ని కోవిడ్ హాస్పటల్స్ కు యుద్దప్రాతిపదికన అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ హాస్పటల్ లోని రోగులకు పూర్తి వైద్య పరీక్షలు,మందులు,స్కానింగ్ కూడా రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని అదే విధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్,సబ్ కలెక్టర్ లను కోరారు.
హాస్పిటల్లో అదనంగా సిబ్బంది పెంపుదల, వసతుల ఏర్పాట్లపై సానుకూలంగా స్పందించినట్లు చదలవాడ తెలిపారు.
కరోనా విజృంభణ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వ్యాప్తి కాకుండా నియమ నిబంధనలు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చదలవాడ సూచించారు.