శ్రీ రామానుజాచార్యుల వారి 1005వ అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ పెద్దజీయర్ మఠంలో ఆదివారం శ్రీ రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం నిర్వహించారు.
టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ప్రపంచ మానవాళికి కరోనా ముప్పు తొలగించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, వారి శిష్యబృందం, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి మరియు ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.రాజగోపాలన్ తదితరులు పాల్గొన్నారు.