27.7 C
Hyderabad
May 15, 2024 06: 52 AM
Slider ఆధ్యాత్మికం

పెద్దజీయర్ మఠంలో శ్రీ రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం

#tirumala

శ్రీ రామానుజాచార్యుల వారి 1005వ అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ పెద్దజీయర్ మఠంలో ఆదివారం శ్రీ రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం నిర్వహించారు.

టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ప్రపంచ మానవాళికి కరోనా ముప్పు తొలగించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పారాయణ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, వారి శిష్యబృందం, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి మరియు ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.రాజగోపాలన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

కొల్లాపూర్ మునిస్సిపాలిటీలో ‘పర్సనల్’ ఎజెండా

Satyam NEWS

Thanks: చీఫ్ జస్టిస్ రమణ చొరవతో పెరిగిన జడ్జిల సంఖ్య

Satyam NEWS

Leave a Comment