అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆదేశాలతో గోల్నాక కమల నగర్ బస్తీలో కలుషిత నీటి నివారణ కోసం జలమండలి అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుధవారం మరమ్మతు పనులు చేపట్టారు. బస్తీలో గత కొన్ని రోజులుగా నల్లాలలో నీటి సరఫరా జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వయంగా బస్తిని సందర్శించి మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు ఆర్ కె బాబు, సంతోష్, వినోద్, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.