మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అరెస్ట్ కు విజయనగరం పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అశోక్ గజపతిరాజు పై కక్షగట్టి ప్రవర్తిస్తున్న జగన్ ప్రభుత్వం, నిన్న రామతీర్ధంలో జరిగిన సంఘటనను అవకాశంగా వినియోగించుకోబోతున్నది. నిన్నటి రామతీర్థం ఘటన పై రెండు సెక్షన్ల కింద అశోక్ గజపతి పై నాన్ బెయిల్ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు భంగం కల్గించడం, గందరగోళం సృష్టించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అంశాలు పై కేస్ నమోదు చేశారు. కేసులు విషయం లో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.
previous post