రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటీంచారు . ఈ క్రమంలోనే ఆయన తంగళ్లపల్లిలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగానే పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
ఇటీవలే కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలోనే పట్టాలు పొందిన ఆదివాసీ రైతులకు రూ.23.56 కోట్లు విలువ చేసే రైతుబంధు చెక్కులను అందించామని వివరించారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో.. పోడు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు.
ఇక నుంచి ఈ భూములకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని.. విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పోడు భూముల్లో ఆదివాసీలు బోర్లు వేసుకునేందుకు గిరివికాసం పథకం కింద.. ప్రభుత్వం బోర్లను వేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.