38.2 C
Hyderabad
April 29, 2024 21: 53 PM
Slider ముఖ్యంశాలు

కాళేశ్వరంతో కళకళలాడుతున్న తెలంగాణ

#Kaleswaram

తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మెడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ ను తెలంగాణ అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు వివరాలను ప్రాజెక్టు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు 500 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీరుస్తూ లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తుందని అన్నారు. తూర్పుకు ప్రవహించి సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని ఒడిసిపట్టి, పడమరకు ఎక్కించి, ప్రజల అవసరాలను తీరుస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

Related posts

కడప జిల్లాలో భారీగా దొరికిన వెండి నగలు

Satyam NEWS

T20 World Cup : సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

Satyam NEWS

ప్రత్యేక హోదా లేనే లేదు

Murali Krishna

Leave a Comment