37.7 C
Hyderabad
May 4, 2024 11: 39 AM
Slider మహబూబ్ నగర్

ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం

#wanaparthy

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం అని, ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.

శనివారం వనపర్తి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కొరకు పాటుపడ్డారని,  ఆయన కలలు సాకారం కాకముందే ఆయన లోకం విడిచి వెళ్లారని ఆమె తెలిపారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణ మనకు సిద్ధించిందని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు  తప్పకుండా పాటించాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వా న్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ అధికారి భీమా సుబ్బారెడ్డి, బి.సి. నాయకులు రాచాల యుగందర్ గౌడ్, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కొమురంభీం జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Satyam NEWS

కనులవిందుగా శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామికి పుష్పార్చన

Satyam NEWS

తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ప్రకట‌న

Sub Editor

Leave a Comment