బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాము కాటుకు గురయ్యారు.ఇంటి వెనుక నర్సరీలో ఉండగా ఆయనను పాము కరిచింది. దీంతో ఆమంచిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆరు గంటల పాటు వైద్యుల అజ్జర్వేషన్లో ఆమంచి ఉండనున్నారు.
మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఆమంచికి పాము కాటు వేసిందన్న సమచారం తెలియడంతో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున మణిపాల్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆమంచి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. కాగా బాపట్ల జిల్లా చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు.