39.2 C
Hyderabad
May 4, 2024 20: 02 PM
Slider ఆధ్యాత్మికం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

#LordBalajee

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం రాత్రి తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ పుష్క‌రిణిలో తెప్పోత్స‌వాలు నిర్వ‌హించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి  వద్దకు చేరుకుంది.

మూడో రోజు స్వామి, అమ్మవార్లు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యం‌,  వేదపండితుల వేదఘోష, అన్నమాచార్య ప్రాజెక్టు సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కనువిందుగా జరిగింది.

Related posts

రుణ మాఫీ నిధులు విడుదలపై రైతుల సంబురాలు

Satyam NEWS

రూ.1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన

Bhavani

‘త‌లైవి’లో అర‌వింద్ స్వామి న్యూ లుక్ కు నీరాజ‌నం

Satyam NEWS

Leave a Comment