40.2 C
Hyderabad
May 5, 2024 15: 15 PM
Slider హైదరాబాద్

బత్తాయి పండ్లు పంచిన అక్షర ఇంటర్నేషనల్ స్కూల్

#Akshara International School

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నేడు కూకట్ పల్లి లోని అక్షర ఇంటర్ నేషనల్ స్కూల్ లో బత్తాయి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్  చైర్మన్ అరిశనపల్లి జగన్మోహన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విటమిన్‌ సి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోజువారి దినచర్య సాఫీగా సాగుతుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని ఆయన తెలిపారు.

బత్తాయి పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని అన్నారు. స్కర్వీ వ్యాధి నివారణకు, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సి విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తయని ఆయన అన్నారు. బత్తాయి పండ్లను బాగా తినటం వల్ల శరీరం పోషకాలను బాగా గ్రహించి రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందని అన్నారు. బత్తాయి పండ్లను కొనుగోలు చేసి వాటిని సాగుచేసే రైతులను ఆదుకోవాలన్న సీఎం కెసిఆర్ మాటలను కూడా జగన్మోహన్ రావు గారు ఈ సందర్భంగా  గుర్తు చేశారు.

Related posts

Over|The|Counter Cbd Oil Lincoln Ne Hemp Cbd Vs Thc Cbd Reddit Does Cbd Hemp Oil Thin Your Blood

Bhavani

 ‘కార్తికేయ 2’కు వినూత్నమైన ప్రచారం….

Satyam NEWS

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజ్: మంత్రి కెటిఆర్ ని బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment