31.2 C
Hyderabad
May 12, 2024 02: 02 AM
Slider ఖమ్మం

ప్రభుత్వ లక్ష్యాలు వెంటనే పూర్తి చేయాలి

#Gautam

ప్రభుత్వ ప్రధాన కార్యక్రమ లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. నూతన కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆసరా పింఛన్లు, హరితహారం, జి.ఓ.59, గృహలక్ష్మీ, బి.సి, మైనారిటీలకు ఆర్థిక చేయూత పథకాల పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఈ నెల 26న చేపట్టనున్న మాస్‌ హారితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణాలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్య సాధనకు కార్యచరణ చేపట్టాలన్నారు. గృహలక్ష్మీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అర్హుల జాబితాను రూపొందించాలన్నారు. జి.ఓ 59 లో ఆమోదించిన దరఖాస్తులన్నింటికి డిమాండ్‌ జారీచేసి, డిమాండ్‌లకు సంబంధించిన వసూళ్ల వేగవంతం చేయాలన్నారు. బి.సి, మైనారిటీలకు ఆర్దిక చేయూత పథకాన్ని అమలుకు కార్యచరణ చేయాలన్నారు.

ఆసర పింఛన్లలో స్పౌస్‌, డెత్‌ కేసులకు సంబంధించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ క్రింద మంజూరైన యూనిట్ల సేకరణ వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. కారుణ్య నియామకాల దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసి జిల్లాలో ఖాలీగా ఉన్న పోస్టులలో అర్హత ప్రకారం భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.

సాంఫీుక సంక్షేమ ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, నోటరైజ్డ్‌ డాక్యుమెంట్ల క్రమబద్దీకరణకు అందిన దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Related posts

ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టబోతున్నాం…!

Satyam NEWS

అప్పటిలో పార్టీ మారిన వైఎస్ ని అవమానించిన వైసీపీ ఎంపి

Satyam NEWS

అందుకే మేం సైకో ముఖ్యమంత్రి అంటున్నది…

Bhavani

Leave a Comment