అధికారంలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులపై..”నమ్మకద్రోహం” పేరు తో అన్ని పోలీసు స్టేషన్ లలో కేసులు పెట్టబోతున్నామని బీజేపీ ఉత్తరాంధ్ర నేత, మాజీ ఎంఎల్సీ మాధవ్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కాలనీలో ఆ పార్టీ పదాధికారుల సమావేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పావని ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధవ్ హాజరైన అనంతరం మీడియా తో మాట్లాడారు. తొమ్మిదేళ్ల అధికారం చేపట్టిన మోడీ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి ని ప్రజలకు తెలియచెబుతామన్నారు. అలాగే అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చి అమలు చేయని పనులపై “నమ్మించి నమ్మకద్రోహం” చేసారని…అన్ని పోలీసు స్టేషన్ లలో కేసులు పెడతామని బీజేపీ నేత మాధవ్ స్పష్టం చేశారు. “ప్రజా చార్జ్ షీట్” పేరు తో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయ ,అక్రమాలపై…చార్జిషీట్ విడుదల చేయబోతున్నామన్నారు.మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఈ చార్జిషీట్ ను పార్టీ పరంగా విడుదల చేయబోతున్నామని మాధవ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇంచార్జ్ లు ,నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
previous post
next post