రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన గవర్నర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు. ఆయనకు ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
previous post