కాలనీలలో ఎలాంటి సమస్యలు తన దృష్టికి తీసుకు వచ్చిన సత్వరమే పరిష్కరిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఉప్పల్ సర్కిల్ కాప్రా డివిజన్లోని జనప్రియ సిల్వర్ క్రెస్ట్ కాలనీలో ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజు లను జనప్రియ సిల్వర్ క్రెస్ట్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలలో ఎలాంటి సమస్యలు తన దృష్టికి తీసుకు వచ్చిన సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాల్ మీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాలనీలలో రోడ్డు, మౌలిక వసతులు కల్పనకు కృషి చేసినందుకు గాను ఘనంగా సన్మానం చేశామన్నారు . అదేవిధంగా కాలనీవాసులు స్ట్రీట్ లైట్లు ,బస్సు సౌకర్యం, తాగునీరు ,ఇతర సమస్యలు విన్నవించగా క్రమక్రమంగా చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రామ్ గోపాల్ ,ప్రధాన కార్యదర్శి కిరణ్, రాధిక, రాజేంద్రనాథ్ పరిసర కాలనీవాసులు, సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్ ,కాప్రా డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్ ,సోషల్ మీడియా ప్రెసిడెంట్ భైరి భాస్కర్ గౌడ్ ,పవన్ ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.