ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలనీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు, తెలంగాణకు హరితహారం, ఆసరా ఫించన్, గొర్రెల పంపిణీ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గృహలక్ష్మి ,దళిత బంధు, ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, కారుణ్య నియామకాలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలపై సమీక్షించి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.