పది లక్షలకు లోపు, ఆ పైగా జనాభా ఉన్ననగరాల కోసం అర్బన్ లోకల్ బాడీ గ్రాంట్స్ (2020-21) మొదటి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 222.25 కోట్లను విడుదల చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
ఇందులో తెలంగాణలోని పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాలకు రూ.105.25 కోట్లు, హైదర్బాద్కు రూ.117 కోట్లు ఉన్నాయి. మెరుగైన పరిరక్షణ, సరఫరా, నీటి నిర్వహణ, సమర్థవంతమైన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం మొదటి విడతగా మొత్తం గ్రాంట్ రూ. 7,419.75 కోట్లు విడుదల చేశామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.