అర్హులైన నిరుపేదలకు టీడ్కో గృహాలను కేటాయించాలని కడప జిల్లాలో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ధర్నాలో ఆయా నేతలు మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ ఇళ్లను కేటాయించకుండా కావాలనే తాత్సరం చేస్తుందన్నారు.
ఇళ్లు పూర్తి అయి ఎంతోకాలమైనప్పటికీ నిరుపేదలకు కేటాయించడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ గ్యారేజ్ సమీపంలోని టిడ్కో గృహాల వద్ద టీడీపీ జెండాలు చేతబూని నిరసనకు దిగారు.
నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు అమీర్ బాబు, హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.