తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు. దీపాల పండుగ చెడుపై ధర్మానికి విజయమన్నారు. దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తుందన్నారు.
previous post