33.2 C
Hyderabad
May 3, 2024 23: 17 PM
Slider ఆదిలాబాద్

బాసరలో అఖండ హరినామ సప్త ప్రవచనం

#basara

నిర్మల్ జిల్లా బాసర లొ జరుగుతున్న అఖండ హరినామ సప్త శ్రీకృష్ణ ఆలయంలో ప్రవచనంలో ముధోల్ నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం వంటి సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీకృష్ణ ఆలయంలో అఖండ హరినామ సప్త కీర్తన ప్రవచన కుమారి వైష్ణవి దీదీ గౌడ్ అలాగే నాందేడ్ నిర్మల్ జిల్లా భూమానంద్ మహారాజ్ గంగాధర్ యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది.

ఈరోజుకు నాలుగవ రోజు.. ఈరోజు కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు గౌరవనీయులు పవర్ రామారావు పటేల్ అఖండ హరినామ సప్త కుమారి వైష్ణవి దేది ప్రవచనాన్ని విని ఎంతో ఆనందం ముద్దులయ్యారు. రామారావు పటేల్ మాట్లాడుతూ కుమారి  చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు దైవముగా భావించి హిందువులు విదేశీ సంస్కృతిని విడనాడి హిందూ సంస్కృతిని నేర్చుకొని తల్లిదండ్రులను పూజించి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని ప్రతిరోజు తల్లిదండ్రులను దీవెన తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది.

కాశీకి వెళ్లిన, కన్యాకుమారి వెళ్లిన రాణి మోక్షం తల్లిదండ్రులను పూజిస్తే వస్తుందని అన్నారు.. అలాగే హిందూ సంస్కృతిని ఆచరిస్తూ కాపాడాలని ముందు తరాలకు పంచాలని రామారావు పటేల్ అఖండ నామ సప్త భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన అదృష్టమని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పవర్ రామారావు పాటిల్ తో పాటు బాసర వీడిసి కమిటీ సభ్యులు, బాసర మండల బిజెపి సీనియర్ నాయకులు అంతగిరి రాజన్న, కోదాటి భగవంతురావు, కొందా పూర్ గంగాధర్, బల్గూరి నర్సింగరావు, బిజెపి టౌన్ అధ్యక్షులు జిడ్డు సుభాష్ యాదవ్, బిదూర్ రమేష్, ఇస్త్రీ అశోక్, భోజన్న ,రంజిత్, చిల్ల రాజేశ్వర్, కుబీరే లింగన్న, కుబీరే దేవేందర్, దావుల రాజు, తనుర్ మండలం బిజెపి సీనియర్ నాయకులు చక్రధర్ పటేల్, కుంటాల గంగయ్య, బిదిరెల్లి శంకర్ పటేల్, సందీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

Satyam NEWS

శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన హుజూర్ నగర్ కనకదుర్గ ఆలయం

Satyam NEWS

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment