సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో లంబాడా సంఘం అధ్యక్షుడు బాణవత్ వెంకటేశ్వర్లు నాయక్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తేజావత్ రవి నాయక్,హోళీ పండుగ ముజావర్(గేరియా) తేజావత్ సైదులు నాయక్ ఆధ్వర్యంలో గిరిజనుల సంస్కృతి,సంప్రదాయాల పద్ధతిలో కాముని దహనం నిర్వహించారు.
హుజూర్నగర్ పట్టణంలో సుమారు యాభై నుండి అరవై సంవత్సరాల వయస్సు గల గిరిజన లంబాడీలు సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం కాముని దహనం చేసిన తర్వాతే ఆనందంతో రంగులు పుాసుకోవటం జరుగుతుందని, కాముని దహనం చేయ్యడం వలన గొడ్డు,గోద,పిల్ల,జల్ల పాడిపంటలు బాగుంటాయని,సంతానం లేని వారికి హోళి దేవతను మ్రొక్కడం వలన సంతనం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఈ పండుగను జరుపుకుంటారని,ఆ ప్రకారమే అప్పటి నుండి ఇప్పటి వరకు పండుగ జరుకుంటున్నామని గిరిజన పెద్దలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిరిజనులు,కుల పెద్దలు అత్యధిక సంఖ్యలొ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్