సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గానికి చెందిన మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అల్లం ప్రభాకర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంటు సభ్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు.
ఈ మేరకు నియామక పత్రాన్ని అల్లం ప్రభాకర్ రెడ్డి కి హైదరాబాద్ యం.పి క్యాంపు కార్యాలయంలో నేడు అందజేశారు. గతంలో అల్లం ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక పార్టీ పదవులు చేపట్టారు. అధికార ప్రతినిధిగా నియమించడంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనపై పిసిసి అధ్యక్షులు ఉత్తమ కుమార్ రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.