40.2 C
Hyderabad
May 5, 2024 16: 09 PM
Slider హైదరాబాద్

హఫీజ్ పేట్ డివిజన్ సమస్యల పరిష్కారానికి చర్యలు

hafeejpet

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారాం బస్తీలో నెలకొన్న డ్రైనేజి సమస్యను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ నేడు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డివిజన్ అభివృధికి నిధులు మంజూరు చేస్తున్నదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాలలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు.

కొత్తగా మంజూరైన సీసీ రోడ్డు పనులను స్థానికులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఒక్క పక్కా ప్రణాళికతో ముందుగా మంజీర పైప్ లైన్ పనులు పూర్తి చేశామని, గంగారాం పరిధిలో కొంతమేర అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మంజీర పైప్ లైన్ పనులు పూర్తి చేసి, సీసీ రోడ్డు పనులను పూర్తి చేస్తామని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించేలా చూస్తామని, మౌలికవసతులతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి ఇంజినీరింగ్ ఏ.ఈ రాజ్యలక్ష్మి, వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, రవి, మున్నా ఖాన్, హనీఫ్ ,ప్రవీణ్, దేవరాజ్, జ్ఞానేశ్వర్, ఇస్మాయిల్, చిన్న, రాజు, వెంకట్, మల్లారెడ్డి, భగత్, వీరేందర్, శివ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Related posts

7వ సారి విద్యుత్ చార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

చిరుత దాడిలో గాయపడిన చిన్నారిని శ్రీవారే రక్షించారు

Bhavani

ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా చేయాలి

Satyam NEWS

Leave a Comment