హైదరాబాద్ లోని ఉప్పల్ లో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ JEET క్రికెట్ అకాడమీ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులతో కలసి క్రికెట్ ఆడి వారిలో స్ఫూర్తి ని నింపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధి కి తోడ్పాటు ను అందిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. క్రీడల అభివృద్ధి కి, మౌలిక సదుపాయాల కల్పన కు, క్రీడాకారులకు, కోచ్ లకు ఈ పాలసీలో పెద్ద పీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ను రూపొందిస్తున్నామన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్.
previous post