తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర నాయకుడు,15వ,వార్డు కౌన్సిలర్ కె.ఎల్.ఎన్.రావు, జిల్లా నాయకులు షేక్. మస్తాన్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,ప్రజల ఆశీర్వాదంతో రెండవసారి ముఖ్యమంత్రి గా ఎన్నికై దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ,అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలబెట్టిన దార్శనికుడు కెసిఆర్ అని అన్నారు.కెసిఆర్ కు భగవంతుడు మరింత శక్తి సామర్ధ్యాలను,ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధికార ప్రతినిధి రణబోతు శ్రీనివాస్ రెడ్డి,ఉదారి సుధాకర్,మామిడి పన్నీరు, షేక్.నయీమ్,ఎన్.సుబ్బారావు,ఉదారి భద్రి,కేశవ్,వేణు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్