హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ హాల్ లో స్ఫూర్తి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, టిన్యూస్ రిపోర్టర్ పోలోజు రామ్మూర్తి సేవారత్న నేషనల్ అవార్డును అందుకున్నారు. తన దృష్టికి వచ్చిన సామాజిక సమస్యలను పరిష్కరిస్తూ, జర్నలిజం రంగంలో ములుగు జిల్లాలో గత కొన్నేళ్లుగా నిస్వార్థంగా సేవలు చేస్తున్న రామూర్తి సేవలు స్ఫూర్తి సర్వీసు సొసైటీ గుర్తించింది.
ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, సామాజిక సేవకులు గూడూరి చెన్నారెడ్డి,మానవ హక్కుల కమిటీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, సంస్థ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రామూర్తికి ఈ అవార్డు రావడంతో సన్నిహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు స్వగ్రామం లక్ష్మీదేవిపేట గ్రామస్తులు, ములుగు జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.