జోగులాంబ గద్వాల హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టల్ శాఖకు సంబంధించిన పొదుపు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ సూపరింటెండెంట్ షేక్ షబ్బీర్ అన్నారు. గద్వాల్ హెడ్ పోస్టాఫీసు ఆవరణలో బీపీఎం, ఏబీపీఎం, పోస్టల్ ఏజెంట్, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపర్డెంట్ షేక్ షబ్బీర్ మాట్లాడుతూ సుకన్య సంవృద్ధి యోజన, సేవింగ్ డిపాజిట్, ఆర్ డి, ఫిక్స్డ్ డిపాజిట్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వంటి పొదుపు పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రజలకు పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉంటుంది.
మరియు చెల్లింపు యొక్క ప్రతి అవకాశాన్ని అందించడం ద్వారా భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు అవకాశాల కోసం ప్రజలు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పి అజయ్ సింగ్ చౌహెన్, IP(C) Md. ఇంతి యాజ్, పోస్ట్మస్టర్, వై ఎల్లారెడ్డి ,ఖాజా అమీరుద్దీన్, ఎం ఓ 1,సూరి బాబు, ఎం ఓ 2, సుధాకర్.బి.పి.ఎం.లు,ఏ.బి.పి.ఎం.లు పోస్టల్ సిబ్బంది, ఖాతాదారులు, తదితరులు పాల్గొన్నారు.