బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార కార్యదర్శి భూమయ్య పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం ఆయన సేవలను కొనియాడారు.
పూలే గొప్ప సంఘ సంస్కర్తని మహాత్మా అనే పేరు ఎంతో గొప్ప వ్యక్తులకు మాత్రమే వస్తుందని అందులో ఆయన ముందున్నారన్నారు. ఆయన చేసిన సామాజిక సేవలను భావితరాలకు తెలియపర్చాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.
అనంతరం ఆయన గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులైన బియ్యం పప్పు కూరగాయలు అందజేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి భూమాయ తో పాటు పాఠశాల చైర్మన్లు లింగయ్య మారుతి పాల్గొన్నారు.
ఇంకా వార్డు సభ్యులు హన్మండ్లు యువ నాయకులు రవి, గంగారాం లాలయ్య సొసైటీ డైరెక్టర్లు హనుమానులు సాయవ్వ, పారిశుద్ధ్య కార్మికురాలు ఈ రవ్వ చంద్రవ్వ మొగులయ్య నాగయ్య ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.