ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఈరోజు ఉదయం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.
కరోనా ఇమ్యునైజేషన్ డ్రైవ్ లో భాగంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వారిద్దరూ కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదు ను తీసుకున్నారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కరోనా మొదటి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన విషయం తెలిసిందే.
రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కరోనా టీకా తీసుకున్నారు.