హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) ద్వారా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకురాగా, నేడు మిధాని – ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ల మధ్య 1.365 కి.మీ పొడవుతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.