కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం మాజీ శాసనసభ్యులు గంగారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ కొరకు విశేష సేవలందించిన సీనియర్ నాయకులకు మాజీ శాసనసభ్యులు శాలువ కప్పి సన్మానం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను తీసుకుంటే ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఇప్పుడున్న ప్రభుత్వాలు చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. మోడీ పాలనలో దేశ ప్రతిష్ట మరింత దిగజారిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులతో పాటు పార్టీ అధ్యక్షులు దర్పల్లి గంగాధర్, సీనియర్ నాయకులు మలికార్జునప్ప షెట్కార్ ,కమల్ కిశోర్ భట్టాడ్,విట్టల్ రెడ్డి, నాగనాథ్,గోపాల్ రెడ్డి,సాయన్న మాణిక్రావు ,శంకర్ పటేల్,తేజ రావు పటేల్,ఎంపీటీసీలు అవారి సురేష్, నారాయణ,యువ నాయకులు గంగాసాగర్ ,సాయిని అశోక్, ముజీబ్ ,మునీర్,రవిదేశాయ్, సుజిత్కుమార్, బాలకృష్ణ,అతర్ శీను, కౌలాస్ కృష్ణా,విఠల్రావు,వెంకట్,గోపన్పల్లి శంకర్ పటేల్,లతో పాటు ఆయా గ్రామాల కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
జీ లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం