పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్బికాలని డివిజన్ లో వార్డు కార్యాలయం సమీపంలో సన్లైఫ్ మల్టీస్పెషాల్టి హాస్పిటల్ను బేతి సుభాష్రెడ్డి, కార్పోరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్లు ముఖ్య అతిధులుగా పాల్గొని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడతూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రజలకు అన్నిసౌకర్యాలు కలిగిన ఆసుపత్రి అందుబాటులోకి తీసుకరావటం అభినందనీయమని డా,, కే.సూర్యప్రకాష్రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ గండారపు శ్రీనివాసరెడ్డి, బాలరాజు,నవీన్గౌడ్, రమేష్, సాయికుమార్ , చంద్రశేఖర్ తదితరలు పాల్గొన్నారు.