సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో మున్నూరు కాపుల భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు.
ఆదివారం పట్టణంలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం హుజూర్నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో కాపుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మున్నూరు కాపులకు రెండు వేల గజాల స్థలాన్ని మంజూరు చేయించేందుకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి స్థలం మంజూరు చేయించి భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేయిస్తానని అన్నారు. ప్రభుత్వం కాపులకు అన్ని రంగాలలో తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని,పార్టీ పదవుల్లోనూ నామినేట్ పోస్టుల్లోనూ కాపులకు పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. అనంతరం మున్నూరు కాపు సంఘం నేతలు సైదిరెడ్డి ని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు కొలా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కామిశెట్టి వెంకటేశ్వర్లు, కాల్వ పెద్ద వెంకటేశ్వర్రావు, కాల్వ సత్యనారాయణ,పోటు నాగేశ్వరరావు, కడియాల రామకృష్ణ,రాయల వెంకటేశ్వర్లు,తోట భిక్షం,నాగేశ్వరరావు, కాల్వ వెంకటేశ్వరరావు,తోట నర్సింహారావు,సైదులు,తోట ఎలమందయ్య,తోట వీరస్వామి,కాసర్ల నాగేశ్వర్రావు,తోట నర్సింహారావు,ఆవుల సతీష్,కాచవరపు సతీష్,గోనె నరేష్, ఆవుల చంద్రయ్య,ఏనుగుల సత్యనారాయణ,శీలం నరేష్,మిర్యాల శ్రీనివాస్,నూకల శ్రీనివాస్,నంభీ మల్లికార్జున్,ఎలిశెట్టి మధు, మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్ష్య, కార్యదర్శులు,మండల కమిటీ బాధ్యులు,గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్