37.2 C
Hyderabad
May 2, 2024 12: 32 PM
Slider కర్నూలు

కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

#roadaccident

కర్నూలు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం కు చెందిన ఆంజనేయులు, తన అక్కలు ఆదిలక్ష్మి, భాగ్య లక్ష్మి, బావ శ్రీనివాసులు, అక్క కొడుకు కుమార్,  తెలిసిన అమ్మాయి తరణి లతో కలిసి హోండా సిటీ కారులో కర్నూలుకు వస్తున్నాడు. అతి వేగంగా వస్తున్న అతను దారిలో ఉలిందకొండ బై పాస్ రోడ్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీ ను వెనక నుండి ఢీకున్నాడు. దాంతో కారులో ఉన్న శ్రీనివాసులు, ఆదిలక్ష్మి, భాగ్యలక్ష్మి లు ప్రమాద స్థలం లోనే చనిపోయారు. ఈ ప్రమాదం లో  మిగిలిన ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే కర్నూలు రూరల్ సీఐ M. శ్రీనాథ్ రెడ్డి, ఉలిందకొండ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి, ఓర్వకల్ ఎస్సై మల్లికార్జున, k నాగలాపురం ఎస్సై ప్రేమ, సిబ్బంది ప్రమాద స్థలం కి వెళ్లారు. అక్కడి క్షత గాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ కి తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి కారణం అయిన వారిపై కేసు నమోదు చేశారు.

Related posts

నెల్లూరు మహిళలూ ఈ నెంబర్లు గుర్తు పెట్టుకోండి

Satyam NEWS

తెలంగాణలో అడుగుపెట్టేసిన ఆర్ధిక మాంద్యం

Satyam NEWS

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక వారోత్సవాలు

Satyam NEWS

Leave a Comment