గత ఏడాది డిసెంబర్లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిన ఏసియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న సాఖీబ్ భాషకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం సాయంత్రం సత్కరించారు. శాలువా కప్పి సన్మానిస్తూ మరింత ముందుకు వెళ్లాలని ఆశీర్వదించారు. రైల్వేలో ను, రాష్ట్ర ప్రభుత్వం లోనూ ఉద్యోగ సిఫారసు కు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చారు. ఇస్తాంబుల్ లో జరిగిన ఏసియన్ పవర్ లిఫ్టింగ్ లోని మూడు ఈవెంట్లలో ఒక కాంస్యం, రెండు వెండి పతకాలను సాఖీబ్ గెలుచుకున్నాడు. ఓవరాల్ గా వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ రాష్ట్ర ,జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో 25 స్వర్ణ ,కాంస్య, రజత పతకాలను గెలుచుకున్న సాఖీబ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కడపలోని కళాశాలలో బి.పి.డి చదువుతున్నాడు. ఇప్పటికే కరాటే బ్లాక్ బెల్ట్ పూర్తి చేసిన నెల్లూరు కోటమిట్ట కు చెందిన సాఖీబ్, తండ్రి సందాని భాష నెల్లూరు లో లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేత సయ్యద్ ఫయాజ్ ఉద్దీన్ మైపాడు అల్లాబక్షు నరసింహారావు నవీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు
previous post