కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఇటిక్యాల రామా రాజు యాదవ్ త్వరగా కోలుకోవాలని రామరాజు యాదవ్ అభిమాన బృందం కొల్లాపూర్ పట్టణం లోని హనుమను టెంపుల్ లో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కొల్లాపూర్ లో ఉన్న వృద్ధాశ్రమం లో వృద్దులకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా రామా రాజు యాదవ్ అభిమాన బృందం సభ్యులు మాట్లాడుతూ నిరంతరం పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటు పడే రామరాజు యాక్సిడెంట్ లో గాయపడ్డారని, ఆయన కొన్ని రోజుల నుండి కళా శాల విధులకు హాజరు కాకపోవడం తో రామా రాజు గారి అభిమానులు, విద్యార్ధులు ఆందోళన తో ఉన్నారని తెలిపారు. ఆ భగవంతుని కృప వలన రామా రాజు యాదవ్ సార్ త్వరగా కోలుకొని పూర్వం లాగా తన విధులు నిర్వహించాలని అంజన స్వామి ని వేడుకున్నారు. ఈ కార్యక్రమం లో రమేష్, నరేష్, వెంకట్, శివ, ఖాజా, సుధాకర్,శ్రీకాంత్,అంజి, కురుమూర్తి, రమేష్,యుగెందర్ ,రాము తదితరులు పాల్గొన్నారు.