శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పేదరికంతో వైద్యం చేయించుకోలేకపోతున్న ఒక చిన్నారిని ఎన్టీఆర్ యువత ఆదుకున్నది. తిరువతి కి చెందిన మధుబాబు, మహిత దంపతులకు ఏడాది పాప ఉంది. ఆ అమ్మాయి శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నది.
అయితే పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు చిన్నారికి వైద్యం చేయిచలేకపోతున్నారు. ఇప్పటికే చిన్నారి అనారోగ్యం కు అధిక ఖర్చు కావడంతో వారు బాధపడుతున్నారు. ఈ తరుణంలో వారికి అండగా రాజంపేట కు చెందిన యన్టీఆర్ యువసేన చిన్నారిని ఆదుకోవడానికిం ముందుకు వచ్చింది.
కడప జిల్లా రాజంపేట కు చెందిన యన్టీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి నాయుడు, మధుసూదన్ యస్వంత్, వంశీ లు 40 వేల రూపాయలను స్వయంగా బాలిక తల్లిదండ్రు లకు అందించారు.