సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీమకుర్తి మండలం, బుధవాడ గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ఎక్స్పోర్ట్, యజమాని వై. శివన్నారాయణ రెడ్డి గ్రానైట్ బండలు బహూకరించారు.
వీటి విలువ రూ.1,20,000 ఉంటుంది. ఆలయ చైర్మన్ భోగాల కొండారెడ్డి సమక్షంలో ఆయన వీటిని అందచేశారు. ఈ బండలను ఆలయ గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం లో వేస్తారు.
ఈ కార్యక్రమంలో సాముల వెంకట్ రెడ్డి, ఆలయం మేనేజర్ చిట్టిప్రోలు సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ కొండారెడ్డి,ఆలయ అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.