కృష్ణా జిల్లా పమిడిముక్కల సిఐ ముక్తేశ్వరరావు, తోట్ల వల్లూరు ఎస్సైఅర్జున్ ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి లావాదేవీల నేపథ్యంలో సీఐ ఎస్ఐలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. జిల్లా ఎస్పీ పి జాషువా సిఐ, ఎస్ఐ ల అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువు కావడంతో సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సై అర్జున్ లను ఇటీవల వీఆర్ కు పిలిచారు. వీఆర్ లో ఉన్న సిఐ, ఎస్ఐ లను ఏసీబీ అధికారులు ఈ కేసు కు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. ఇరువురుపై నేరం రుజువు కావడంతో ఏ సి బి అధికారులు కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు సిఐ, ఎస్ఐ లను రిమాండ్ కు తరలించారు.
previous post