Slider కృష్ణ

హత్య కేసులో లంచం: సీఐ ఎస్ఐ అరెస్టు

#pamidimukkala

కృష్ణా జిల్లా పమిడిముక్కల సిఐ ముక్తేశ్వరరావు, తోట్ల వల్లూరు ఎస్సైఅర్జున్ ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి లావాదేవీల నేపథ్యంలో సీఐ ఎస్ఐలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. జిల్లా ఎస్పీ పి జాషువా సిఐ, ఎస్ఐ ల అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువు కావడంతో  సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సై అర్జున్ లను ఇటీవల వీఆర్ కు పిలిచారు. వీఆర్ లో ఉన్న సిఐ, ఎస్ఐ లను ఏసీబీ అధికారులు ఈ కేసు కు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. ఇరువురుపై నేరం రుజువు కావడంతో ఏ సి బి అధికారులు కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు సిఐ, ఎస్ఐ లను రిమాండ్ కు తరలించారు.

Related posts

రాంచరణ్, ఉపాసన లకు కూతురు

Bhavani

Natural Male Enhancement Pills Smiling Bob

Bhavani

తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా ఒక వెబ్ సిరీస్

Satyam NEWS

Leave a Comment