1925 విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్…కేవలం…అంటే కేవలం అయిదురుతో మాత్రమే ప్రారంభించబడంది..నేడు వందేళ్లు పూర్తి చేసుకున్నసందర్భంలో దాదాపు యాభై వేల శాఖలతో పలు క్షేత్రాలలో శాఖోప శాఖలపై విస్తరించి…అఖండ భారతావని అందిపుచ్చుకునేందుకు అడుగు దూరంలో ఉందంటోంది…ప్రముఖ న్యూస్ నెట్ వర్క్.”సత్యం న్యూస్. నెట్ “. సంఘ్ అదే ఆర్.ఎస్.ఎస్ ఏడాదిలో జరుపుకుంటున్న పండుగలలో ఉగాది ఉత్సవం ఒక్కటి. ఈ సందర్భంగా విజయనగరంలో ఆర్.ఎస్.ఎస్…పూర్ణ గణవేష్ తో పథ సంచలనం(రూట్ మార్చ్) నిర్వహించింది. ఆర్.ఎస్.ఎస్ ప్రాంత సహ కార్యవాహ్ యుగంధర్ జీ మార్గదర్శనం చేసారు.
పూర్తి యూనిఫాంతో…దాదాపు 150 మంది గణవేష్ లో అదీ ఘోష్ (వాద్యం) తో సాగిన రూట్ మార్చ్…నగర ప్రజలలో అదీ ఆ రూట్ మార్చ్ చూసిన వాళ్లలో..అఖండ్ భారత్ అదీ భారత్ దేశ పూర్వవైభవం..ఇంకెంత దూరంలో లేదని అనిపించింద. ఈ పథ సంచలనంలో…బాల,తరుణ,ప్రౌడ (చైల్డ్,యూత్,పెద్దలు) లు కలిసి దాదాపు 150 మంది నగరంలోని రింగ్ రోడ్ వద్ద ఉన్న పీఎస్ఆర్ స్కూల్ నుంచీ..ఐస్ ఫ్యాక్టరీ…కోట,బాలాజీ..డిప్యూటీ స్పీకర్ ఇంటి మీదుగా…తిరిగి పీఎస్ఆర్ స్కూల్ కు చేరుకుంది.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లు వంశీ,రాజశేఖర్,అలాగే శారీకర్ ప్రముఖ్ వెంకటేష్, నగర సంచాలకులు తోటశ్రీధర్, రిటైర్డ్ ఎమ్మార్వో రమణమూర్తి, చెణకూరి శ్రీధర్, నాగేంద్ర,చంద్రశేఖర్, లతో పాటు స్వయం సేవక్ లు పాల్గొన్నారు.కాగా… ఉపాధ్యాయులు మూర్తి…పాడిన వైయుక్తిక్ గీత..కార్యక్రమానికి వచ్చిన వారిలో దేశభక్తిని ఇనుమడింప చేసింది.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా