Slider నల్గొండ

పుట్లయ్య మృతితో దిగ్ర్భాంతి లో కార్మిక లోకం

#HujurnagarMunicipality

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సీనియర్ కార్మిక సభ్యుడు అంద పుట్లయ్య బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందినాడు. ఆయన మృతి సందర్భంగా గురువారం పనులన్ని బందు చేసి మున్సిపల్ కార్మికులు పుట్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి  సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి మాట్లాడుతూ లాక్ డౌన్ కాలంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయలు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, డబల్ బెడ్ రూమ్ కల్పించాలని కోరారు.

వేతన సవరణ కార్మికుల హక్కులకోసం జరిగిన పోరాటంలో పుట్లయ్య కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పుట్లయ్యకు నివాళులు అర్పించిన వారిలో మెరుగు దుర్గారావు, కస్తాల ముత్తమ్మ, కొమ్ము వరలక్ష్మి, కుమారి, సైదులు, గోపి, చంద్రకళ, రాములు, వెంకటరమణ, ఇతర యూనియన్ నాయకులు  పాల్గొన్నారు.

Related posts

ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన వాలంటీర్

Satyam NEWS

ఢిల్లీ లిక్కర్ స్కామ్: మా అబ్బాయి అమాయకుడు

Satyam NEWS

నర్సింగ్ కళాశాల పనులను వెంటనే పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment