కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది.
భాజపా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు యెండల లక్ష్మీ నారాయణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎండల మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం తామే అవుతామన్నారు.
కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా గ్రేటర్లో తప్పకుండా తమ సత్తా చాటుతామన్నారు. ఆయా పార్టీల నుంచి పలువురు పార్టీలోకి చేరగా వారికి భాజపా నాయకులు సాదరంగా పార్టీ కండువా కప్పి భాజపాలో ఆహ్వానించారు.
కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ,కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి కాటేపల్లి వెంకటరమణారెడ్డి,భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మాధురి,మాజీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ కోకన్వీనర్ మోహన్,
కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్, జుక్కల్ నియోజకవర్గ ఆయా మండలాల అధ్యక్షులు కిష్టారెడ్డి, హనుమాన్లు ,ప్రశాంత్, హనుమాన్లు ,చంద్రయ్య, సంతోష్ తో పాటు ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు .