38.7 C
Hyderabad
May 7, 2024 17: 17 PM
Slider ప్రత్యేకం

రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలి

#Chandrababu Naidu TDP

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం రైతు నరేంద్ర ను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదని ఆయన అన్నారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించిందని ఆయన తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యిందని చంద్రబాబునాయుడు అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్ర ను విడుదల చెయ్యాలి…..వేధింపులకు గురిచేసినందుకు నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Related posts

కిషోర బాలికలకు నెలసరి పరిశుభ్రత పై అవగాహన సదస్సు

Satyam NEWS

సెల్ఫీ వీడియో తీసి దంపతులు ఆత్మహత్య

Satyam NEWS

బిజెపి కామెంట్: సొమ్ము మాది…. పేరు జగన్ రెడ్డిది

Satyam NEWS

Leave a Comment