32.2 C
Hyderabad
May 16, 2024 11: 47 AM
Slider తూర్పుగోదావరి

మండపేట లో తాపేశ్వరం కాజా ఔట్ లెట్

#tapeswaramkaja

రహదారి పనుల నిమిత్తం తాపేశ్వరం -ద్వారపూడి రోడ్డును మూసివేసిన నేపథ్యంలో తాపేశ్వరం కాజా మాతృ సంస్థ సురుచి మండపేటలో ఓ ఔట్ లెట్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ జిల్లా అధ్యక్షులు నంది కొల్ల రాజు పాల్గొన్నారు. ఈ నూతన శాఖను విజయదశమి రోజు  MLC శ్రీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. తాపేశ్వరం రోడ్డుపై రాకపోకలను నిరోధించిన  దృష్ట్యా , కస్టమర్ల సౌకర్యం కోసం తాము మండపేట శాఖను తాత్కాలికంగా నెలకొల్పామని  మల్లిబాబు తెలిపారు.

ఈ ఔట్ లెట్ లో అన్నిరకాల స్వీట్స్, హాట్స్ లభ్యం అవుతాయని ఆయన అన్నారు. ఆన్ లైన్ ఆర్డర్స్, ఫోన్ ద్వారా ఆర్డర్ బుకింగ్స్ యధాతథంగానే జరుగుతాయని మల్లిబాబు చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో మండపేట మునిసిపల్ చైర్ పర్సన్ దుర్గారాణి, మునిసిపల్ కౌన్సిలర్లు,  వైస్సార్సీపీ నాయకులు  తోట పృధ్వి రెడ్డి రాజబాబు, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి,   కర్రి పాపారాయుడు, కాంగ్రెస్ నేత కామన్  ప్రభాకర రావు, మునిసిపల్ మాజీ  చైర్ పర్సన్ చుండ్రు ప్రకాష్, మునిసిపల్ కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్,  కొనగళ్ల సత్యనారాయణ, MRPS నేత బుంగా సంజయ్,  ​మునిసిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్   పలువురు పట్టణ ప్రముఖులు, స్వీట్ షాపుల యజమానులు, కస్టమర్లు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Related posts

యువత స్వయం కృషితో రాణించాలి

Satyam NEWS

కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి

Satyam NEWS

70 మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు

Satyam NEWS

Leave a Comment