పోటీ ప్రపంచంలో రాణించడానికి స్వయం కృషితో ముందుకు వెళ్ళాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మోడెం శ్రీనివాస్ నూతనంగా ఫోటో స్టూడియో, జీరాక్స్ సెంటర్, స్టాంప్ వెండర్ షాపు ఏర్పాటు చేసుకున్నారు.
బుధవారం ముఖ్య అతిథిగా అక్కడకు సబ్ రిజిస్టర్ తస్లీమా, ములుగు ఎస్ఐ రాధిక, గ్రామ సర్పంచ్ మెడ బోయిన అశోక్, ఎంపీటీసీ జంగిలి శ్రీలత రవి వెళ్లారు. రిబ్బన్ కట్ చేసి షాప్ ను ప్రారంభించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ వ్యాపార,వాణిజ్య రంగాల వారు స్వయం కృషితో రాణిస్తూ ముందుకు వెళ్ళాలని,వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి సహకరించాలని తస్లీమా సూచించారు.