తాగుడు అలవాటు లేకపోయినా ఇక్కడి ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్నతాధికారులు శిక్ష విధించారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం డ్రైవర్లు ఆందోళనకు దిగారు. డ్రైవర్లకు నిర్వహించే బ్రీత్ అనలైజర్ టెస్టులో తాము తాగకున్న తాగినట్టు చూపెట్టి, విధులు కేటాయించలేదని డ్రైవర్లు ఆరోపించారు.
ట్రాఫిక్ పోలీసుల బ్రీత్ అనలైజర్లో అదే డ్రైవర్ తాగినట్టుగా చూపెట్టకపోవడంతో ధర్నాను కొనసాగిస్తున్నారు. పనిచేయని బ్రీత్ అనలైజర్తో 70 మందిని సస్పెండ్ చేశారని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.