ఉత్తరప్రదేశ్ లో ఈనెల 19 నుంచి వారం రోజుల పాటు జరిగే జాతీయ హాకీ పోటీలలో తెలంగాణ మహిళలు సత్తా చాటాలని తెలంగాణ హాకీ చైర్మన్ కొండా విజయ్ సూచించారు. హోప్ ఫాండేషన్, రంగారెడ్డి అధ్వర్యం లో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో వారం రోజుల పాటు జరిగిన తెలంగాణ సీనియర్, జూనియర్ జట్ల శిక్షణ క్యాంపు కార్యక్రమం ముగియడం తో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. సీనియర్ జట్టు కెప్టెన్ శృతి, వైస్ కెప్టెన్ మాధురి రెడ్డి లతో పాటు మొత్తం 18 మంది క్రీడాకారులను జాతీయ హాకీ టోర్నమెంట్ కు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
దీంతోపాటు ఈనెల 20 నుంచి జార్ఖండ్లో నిర్వహించనున్న జూనియర్ జాతీయ టోర్నమెంట్ కు కెప్టెన్ గా అంజలి, వైస్ కెప్టెన్ గా అపర్ణ ల ను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి హాకీ సెక్రటరీ భాస్కర్ రెడ్డి తోపాటు తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు.