28.7 C
Hyderabad
May 6, 2024 00: 00 AM
Slider ఖమ్మం

అటవీ, రెవిన్యూ భూముల సమస్య పరిష్కరించాలి

#revenue lands

అటవీ, రెవిన్యూ భూముల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణంలో పర్యటించి అటవీ, రెవిన్యూ భూ సమస్యలపై క్షేత్ర తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లంకపల్లి అర్బన్ పార్క్, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్ఎస్పి కెనాల్ వద్ద స్మృతి వనం సమస్యలు పరిశీలించారు.

లంకపల్లి అర్బన్ పార్క్ వద్ద ఖబరస్తాన్ కు సంబంధించి హద్దులు నిర్ణయించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవన నిర్మాణ విషయమై జామాయిల్ చెట్ల స్థలాన్ని కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎన్ఎస్పి కెనాల్ వద్ద ఎన్ఎస్పి భూములకు సంబంధించి అటవీ శాఖ అభ్యంతరాలపై పరిశీలించి తగుచర్య చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఎఫ్డివో మంజుల, సత్తుపల్లి మునిసిపల్ చైర్మన్ మహేష్, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

సర్పంచ్‌లకు వై ఎస్ జగన్ ప్రభుత్వం ‘స్వాతంత్య్ర’ ఝలక్

Satyam NEWS

ట్రాజెడీ:తల్లి అంత్యక్రియలకు వస్తూ కొడుకు కోడలు మృతి

Satyam NEWS

వైసీపీకి తలనొప్పిగా మారిన చీరాల వర్గపోరు

Satyam NEWS

Leave a Comment