కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని రాష్ట్రీయ ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంకు వద్ధ లారీ కారు ఢీకొనడంతో భార్య, భర్త కుమారుడు తోసహ ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న
రాజేష్ హైదరాబాదు నుంచి కుటుంబంతో సహా స్వగ్రామానికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో కుమారుడి పరిస్థితి విషమం గా వున్నది.
అంబులెన్స్ లో ఖమ్మం ఆసుపత్రికి తరలింపు చికిత్స చేస్తున్నారు. మృతులు పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు కుమారుడు అశ్విత్ (13) వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.