ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి , ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో పులుల భయం స్థానికులను వెంటాడుతుంది.
గత నెల 22 న వాజేడు మండలంలోని కొంగాల ప్రాంతంలో చిరుత కనిపించింది. కన్నాయిగూడెం ఐలాపురం అడవుల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఈ నెల 8 న వాజేడు మండలం దూలాపురం అడవి ప్రాంతంలో ఓ లేగ దూడను పులి చంపేసింది. ఐలాపూర్ మండలంలో పెద్ద పులి అడుగు జాడలు కనిపించాయి.
దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పులుల జాడ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అడవుల్లోకి స్థానికులు వెళ్లవద్దని సూచించారు.