నిమ్స్ ఆసుపత్రిలో అకస్మాత్తుగా కలకలం చెలరేగింది. ఎందుకంటే ఒక యువతికి సర్జరీ చేస్తుండగా ఒక బుల్లెట్ బయటపడింది. ఇదేంటి? ఆపరేషన్ చేస్తుంటే బుల్లెట్ బయటకు రావడం ఏమిటని డాక్టర్లు ఆశ్చర్యపోయారు. బయట పడ్డ బుల్లెట్ ను భద్రపరిచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు రంగంలో దిగి విచారణ మొదలు పెట్టగా ఆ యువతిని ఫలక్ నుమా కు చెందిన ఆస్మా బేగం గా పోలీస్ లు గుర్తించారు. ఆస్మా బేగం వెన్ను నొప్పితో గత 2 నెలలుగా నిమ్స్ ఆసుపత్రికి వస్తున్నది. ఎక్స్ రే తీయగా వెన్నుముక లో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు వివరాలు అడిగిన చెప్పక పోవడంతో నిమ్స్ వైద్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.